తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ను స్ఫూర్తిగా తీసుకోవాలి

ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్​ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. త్వరలో శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు వస్తాయని.. ఆ నీరును రైతులకు నేరుగా అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

By

Published : Aug 22, 2019, 5:06 PM IST

సీఎం కేసీఆర్​ను స్ఫూర్తిగా తీసుకోవాలి

సీఎం కేసీఆర్​ను స్ఫూర్తిగా తీసుకోవాలి
పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు పని చేయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల ఎన్నిక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఏడు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్​ను స్ఫూర్తిగా తీసుకొని.. ప్రజలకు నిరంతర సేవకుడిగా మారాలన్నారు. త్వరలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ నీటిని రైతులకు నేరుగా అందించేందుకు వరద కాలువపై తూములు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details