హరితహారం, పట్టణప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలపై మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్తో పాటు కమిషనర్ జితేష్ పాల్గొన్నారు. జూన్ 20 నుంచి ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
'హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ బతికించాలి' - minister ktr video conference with municipal officers
హరితహారం, పట్టణప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలపై అధికారులతో మంత్రి కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్షను నిర్వహించారు. జూన్ 20న ప్రారంభంకానున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని.. నాటిన మొక్కలను రక్షించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ ఛైర్మన్, మేయర్, కమిషనర్ తీసుకోవాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి తప్పనిసరిగా ఓ నర్సరీ ఉండాలని దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!