తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా - mid day meal workers protest infront of edapalli MRO office

మధ్యాహ్న భోజనం వండేవారికి నెలవారీ జీతాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

mid day meal workers protest infront of MRO office in edapalli nizamabad
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

By

Published : Mar 11, 2020, 3:29 PM IST

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్న భోజనం వండే వారికి నెలకు రూ. 21 వేల జీతం, విద్యార్థికి రూ. 15 మెనూ ఛార్జీలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్నం భోజనం వండే వారిని శాశ్వత ఉద్యోగుల ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... తమ డిమాండ్లను పరిశీలించాలని కోరారు.

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

ఇవీ చూడండి:తెలంగాణలో కరోనా లేదు: ఈటల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details