తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 12:27 PM IST

ETV Bharat / state

'తెరాస ఓడితే మోదీ కూడా ఓడిపోతారు'

రాష్ట్రంలో తెరాసను ఓడిస్తే.. కేంద్రంలో మోదీ ఓడిపోతారని నిజామాబాద్​ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్​కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్​ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ

నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానానికి తెరాస, భాజపా అభ్యర్థులు ఇద్దరు నామినేషన్​ వేశారు కానీ.. వారిద్దరు ఒకే పార్టీకి చెందిన వారని కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ అన్నారు. జిల్లాకేంద్రంలోని చంద్రశేఖర్​ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన హస్తం పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

నిజామాబాద్​ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ

ABOUT THE AUTHOR

...view details