నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రెండు లారీలు నిర్మల్ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాయి. ముందు వెళ్తున్న లారీని వెనక వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టగా బోల్తాపడి నుజ్జునుజ్జయ్యాయి. లారీల ముందు భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీహరి వాహనాలను మరో మార్గంలో దారి మళ్లించారు. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా, మరొకరు రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వెనుక నుంచి లారీని ఢీకొన్న మరో లారీ..ఇద్దరు మృతి
అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు లారీ చోదకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
రెండు లారీలు ఢీ...ఇద్దరు చోదకులు మృతి