నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు కొంతమంది కార్మికులు, నాయకులు ఆచన్పల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మహిళా కండక్టర్లు బోధన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు ముందు బైఠాయించి, తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా - బోధన్లో ధర్నా చేస్తున్న మహిళా కండక్టర్ల అరెస్ట్
నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. కొందరు మహిళా కండక్టర్లు హైదరాబాద్ బస్సును ఆపి... రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
![బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4976191-51-4976191-1573025170035.jpg)
బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా
బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా