తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొండా లక్ష్మణ్​ బాపూజీ నిఖార్సైన తెలంగాణ వాది' - నిజామాబాద్​లో కొండా లక్ష్మణ్​ బాపూజీ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్​ బాపూజీ జయంతి వేడుకలను నిజామాబాద్​ జెడ్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్​ బాపూజీ చిత్రపటానికి జెడ్పీఛైర్మన్​ విఠల్​రావు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

konda laxman bapuji 105th birth anniversary celebrations in nizamabad
'కొండా లక్ష్మణ్​ బాపూజీ నిఖార్సైన తెలంగాణ వాది'

By

Published : Sep 27, 2020, 5:55 PM IST

కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జెడ్పీ కార్యాలయంలో బాపూజీ చిత్ర పటానికిి పూలమాలలు వేసి ఛైర్మన్​ విఠల్​రావు ఘనంగా నివాళర్పించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడడంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకపాత్ర పోషించారని స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్న నిఖార్సయిన తెలంగాణ వాది అని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని అన్నారు.

నిజామాబాద్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details