తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారం లేకపోయినా.. అందుబాటులోనే ఉంటాను'

నిజామాబాద్​ జిల్లా, మంచిప్ప గ్రామంలో గుండెపోటుతో మరణించిన తెరాస కార్యకర్త కిశోర్​ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎంపీ కవిత హామీ ఇచ్చారు.

By

Published : May 27, 2019, 3:06 PM IST

కవిత పరామర్శ

నిజామాబాద్‌ జిల్లా మోపాల్​ మండలం మంచిప్పలో గుండెపోటుతో మరణించిన తెరాస కార్యకర్త కిశోర్​ కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత పరామర్శిచారు. కిశోర్​ కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహాజం కాబట్టి కార్యకర్తలందరూ సహనం కలిగి ఉండాలని సూచించారు. గెలిచిన వారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వ్యాఖ్యానించారు. అధికారం లేకపోయినా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని కవిత వెల్లడించారు.

కవిత పరామర్శ

ABOUT THE AUTHOR

...view details