తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2020, 11:26 PM IST

ETV Bharat / state

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా వీర జవాన్లకు శ్రద్ధాంజలి

కార్గిల్​ యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర జవాన్లను గుర్తు చేసుకుంటూ నిజామాబాద్​లోని ఎల్లమ్మగుట్టపై ఉన్న కార్గిల్​చౌరస్తాలోని స్తూపానికి భాజపా నాయకులు నివాళులర్పించారు. అమరుల సేవలను గుర్తుచేసుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

kargil vijay divas celebrated in nizamabad
కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా వీర జవాన్లకు శ్రద్ధాంజలి

కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా భారతీయ జనతా పార్టీ నగరశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్​ జిల్లా ఎల్లమ్మ గుట్టపై కార్గిల్ చౌరస్తాలోని స్తూపానికి పూలమాలలు వేసి అమరులైన సైనికులకు నివాళులర్పించారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

భారత వాస్తవాధీన రేఖను ధాటి పాకిస్తాన్ సైనికులు చొరబాటును వీరోచితంగా తిప్పికొట్టి దేశం కోసం ప్రాణాలనర్పించిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భాజపా నగర అధ్యక్షులు యెండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, ప్రధాన కార్యదర్శులు స్వామి యాదవ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details