తెలంగాణ

telangana

ETV Bharat / state

కబడ్డీ ఆడుతూ పంచాయతీ కార్యదర్శి మృతి - ఆడుతూనే చనిపోయిన పంచాయతీ కార్యదర్శి

కూతకు వెళ్లిన రైడర్​... మళ్లీ తన కోర్టుకు రాలేదు. వచ్చిన కూతగాళ్లను తన పట్టుతో గీత దాటనివ్వని డిఫెండర్​... ప్రత్యర్థుల కోర్డులోనే కుప్పకూలిపోయాడు. మూడు నెలల క్రితమే ఉద్యోగం వచ్చిన జూనియర్​ పంచాయతీ కార్యదర్శి.... ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని మైదానంలోనే తుదిశ్వాస విడిచాడు.

JUNIOR PANCHAYAT SECRETARY DIED WHILE PLAYING KABADDI IN NIZAMABAD
JUNIOR PANCHAYAT SECRETARY DIED WHILE PLAYING KABADDI IN NIZAMABAD

By

Published : Feb 7, 2020, 9:06 PM IST

నిజామాబాద్​ కలెక్టరేట్​ మైదానంలో జరుగుతున్న టీఎన్జీవోస్ ‌క్రీడా పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ... సురేశ్​ అనే ఉద్యోగి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే సురేశ్​ మృతి చెందాడు.

సురేశ్​... డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శిగా 3 నెలల కింద ఉద్యోగంలో చేరాడు. సురేశ్​, ఆయన భార్య... నిజామాబాద్​లోని వినాయక్​నగర్​లో నివాసం ఉంటున్నారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర సంతాప తెలిపిన టీఎన్డీవో సభ్యులు సురేశ్​ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కబడ్డీ ఆడుతూ తుది శ్వాస విడిచిన పంచాయతీ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details