తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్​ఎంసీ బిల్లు ఉపసంహరించుకునే వరకు ఆందోళన' - undefined

ఎన్​ఎంసీ బిల్లుతో భారత వైద్య రంగ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతుందని నిజామాబాద్​ ప్రభుత్వాసుపత్రి జూనియర్​ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.

'ఎన్​ఎంసీ బిల్లు ఉపసంహరించుకునే వరకు ఆందోళన'

By

Published : Aug 7, 2019, 6:02 PM IST

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్​లో జూనియర్​ వైద్యులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఇవాళ జూడాలు వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టారు. వైద్య విద్యలో ఇప్పటి వరకు 85% ప్రైవేటు కళాశాలల సీట్లు, ఫీజులు, నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండేదని... ప్రస్తుతం ఈ బిల్లు ద్వారా 15 నుండి 50 సీట్లు, ఫీజు పెంపు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఇష్టానుసారం కానుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్​ చేశారు.

'ఎన్​ఎంసీ బిల్లు ఉపసంహరించుకునే వరకు ఆందోళన'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details