ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో చెరువులు అలుగులు పారటం, వాగులువంకలు పోటెత్తటం వల్ల.. జలాశయాలకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా... గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ప్రజలు పోటెత్తున్నారు.
శ్రీరాంసాగర్ జలాశయం..
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నుంచి 33 గేట్లు ఎత్తి... 3 లక్షల 52 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.7 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు దిగువన గోదావరి ఉగ్రరూపం దాల్చడం వల్ల ప్రజలెవరూ నదీ తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.