కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ సమర్థమంతంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలను అందరూ కొనియాడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను నోట్ల దండలతో ఘనంగా సన్మానించారు. నగరంలోని గంగస్థాన్ కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల కోసం ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పనిచేస్తున్న కార్మికుల సేవలకు ఏమిచ్చిన తక్కువేనని సొసైటీ అధ్యక్షుడు జగత్రెడ్డి అన్నారు. వారికి నిత్యావసర సరుకులు సైతం అందజేశారు.
నోట్ల దండలతో మున్సిపల్ కార్మికులకు సన్మానం - Corona virus Municipal Workers
నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులను కరెన్సీ నోట్ల దండలతో సన్మానించారు. నగరంలోని గంగస్థాన్ కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
నోట్ల దండలతో మున్సిపల్ కార్మికులకు సన్మానం