తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 1:43 PM IST

ETV Bharat / state

నిజామాబాద్​లో 'ఏక్​ భారత్​ - శ్రేష్ఠ్​ భారత్​'

నిజామాబాద్​లో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా 2కే రన్ నిర్వహించారు​. జిల్లా కలెక్టర్​ జెండా ఊపి ప్రారంభించగా.. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎంపీ అర్వింద్​ హాజరయ్యారు.

ek-bharat-sresth-bharat-in-nizamabad

సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్​ నగరంలో 2కే రన్​ నిర్వహించారు. జిల్లా కలెక్టర్​ ఎం. రామ్మోహనరావు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ అర్వింద్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఏక్​ భారత్​- శ్రేష్ఠ్​ భారత్​, భారత్​ మాతాకీ జై వంటి నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరుగులో పాల్గొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సాగిన 2కే రన్​ కలెక్టరేట్​ నుంచి వర్ని చౌరస్తా వరకు కొనసాగింది.

నిజామాబాద్​లో 'ఏక్​ భారత్​ - శ్రేష్ఠ్​ భారత్​'

ఇవీచూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details