ప్రతి పేదవాడి కల.. రెండు పడక గదుల ఇల్లు - రెండు పడక గదుల ఇళ్లు పథకం
పేదవాళ్లు గౌరవంగా బతికే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
డబుల్ భెడ్రూం ఇళ్లు ప్రారంభం
ప్రతి పేదవాడికి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని రోడ్లు,భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్లో నూతనంగా నిర్మించిన 50 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు జరుగుతున్నాయని, పైపులైన్ పనులు జరిగే క్రమంలో రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. చెప్పుడు మాటలు వినకుండా సాగునీటి పైప్లైన్ పనులకు సహకరించాలని రైతులను కోరారు.