తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​గా పోచారం తనయుడు ఏకగ్రీవం

నిజామాబాద్​లోని డీసీసీబీ, డీసీఎంఎస్​లోని అన్ని పదవులు ఏకగ్రీవమయ్యాయి. డీసీసీబీ ఛైర్మన్​గా సభాపతి పోచారం తనయుడు భాస్కర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యకర్తలు, అనుచరులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

By

Published : Feb 29, 2020, 3:30 PM IST

DCCB, DCMS CHAIRMEN ELECTIONS IN NIZAMABAD
DCCB, DCMS CHAIRMEN ELECTIONS IN NIZAMABAD

నిజామాబాద్ డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. డీసీసీబీ ఛైర్మన్​గా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్​రెడ్డి, వైస్ ఛైర్మన్​గా రమేశ్​రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంస్ ఛైర్మన్​గా మోహన్, వైస్​ఛైర్మన్​గా ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు.

ఒక్కో పదవికి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్లు రావటం వల్ల 11గంటల తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. పార్టీ తరఫున మంత్రి ప్రశాంత్​రెడ్డి ఎన్నికను పర్యవేక్షించారు. భాస్కర్ రెడ్డి ఛైర్మన్​గా ఎన్నికైన ఆనందంతో కార్యకర్తలు, అనుచరులు టపాసులు కాల్చారు.

డీసీసీబీ, డీసీఎంఎస్​లో అన్ని డైరెక్టర్ స్థానాలతోపాటు ఛైర్మన్, వైస్​ఛైర్మన్లను ఏకగ్రీవం కావడం సంతోషంగా ఉందని... పార్టీ అధిష్ఠానం ఆదేశాలకనుగుణంగానే అందరూ నడుచుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డీసీసీబీని రాష్ట్రంలో అగ్రస్థానంగా నిలపడమే లక్ష్యంగా పని చేస్తానని ఛైర్మన్ భాస్కర్​రెడ్డి పేర్కొన్నారు.

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​గా పోచారం తనయుని ఏకగ్రీవం

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details