తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

రెండు పడకల గదుల ఇళ్లను పేదలకే మంజూరు చేయాలని సీపీఎం నిజామాబాద్​ జిల్లా కార్యదర్శి రమేశ్​ బాబు డిమాండ్​ చేశారు. ఇళ్ల మంజూరులో అధికార పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ వద్ద ధర్నా చేపట్టారు.

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Jul 27, 2020, 8:35 PM IST

డబుల్​ బెడ్​రూం ఇళ్ల మంజూరులో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్​ బాబు ఆరోపించారు. నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

బోధన్ మండలం పెద్ద నవానందిలో అడ్డగోలుగా అనర్హులకు ఇళ్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్​లో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వై.గంగాధర్, శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details