తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2021, 6:25 PM IST

ETV Bharat / state

విధిగా కరోనా నిబంధనలు పాటించాలి: రెడ్ క్రాస్ సొసైటీ

నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

corona awareness program, nizamabad red cross society
రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన, నిజామాబాద్​లో కరోనాపై అవగాహన

అందరూ మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రచారం చేస్తున్నారు.

అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని అవగాహన కల్పిస్తున్నారు. అందరూ టీకా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:ఆక్సిజన్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details