తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు - నిజామాబాద్ జిల్లా వార్తలు

బోధన్​లో అక్రమ కట్టడాలు తొలగించే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి నోటీసులు లేకుండా నిర్మాణాలను ఎలా కూర్చేస్తారని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్​ ఇంఛార్జ్​ కమిషనర్​ శివానందం వారికి నచ్చజెప్పారు.

బోధన్​లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు
బోధన్​లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు

By

Published : Feb 27, 2020, 5:27 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల తొలగింపు వివాదాస్పదమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను జేసీబీతో తొలగించేందుకు సిబ్బంది రాగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా కూల్చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు.

మున్సిపల్ ఇంఛార్జ్​ కమిషనర్ శివానందం, ఆర్డీవో గోపీరాంలు పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ప్రస్తుతం మార్కింగ్ చేస్తామని.. అక్కడి వరకు తొలగించుకోవాలని కమిషనర్ సూచించారు. లేదంటే తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.

బోధన్​లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు

ఇవీ చూడండి:ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ABOUT THE AUTHOR

...view details