కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎన్నికల నియామవళి అనుసరిస్తూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 9న పోలింగ్, 12న లెక్కింపు ఉంటుందని, ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు.
50 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన:
ఇందూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 824 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి వెల్లడించారు. 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని.. ఒప్పుకోకపోతే ఆరు పోలింగ్ స్టేషన్లలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నియామవళి అనుసరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భౌతికదూరం కచ్చితంగా పాటించాలన్నారు.