తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దమ్మ తల్లి గుడిలో చోరీ... హుండీ ధ్వంసం - నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని పెద్దమ్మ దేవి ఆలయంలో చోరీ

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని పెద్దమ్మ దేవి ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

chori
పెద్దమ్మ తల్లి గుడిలో చోరీ... హుండీ ధ్వంసం

By

Published : Jan 5, 2020, 3:28 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని పెద్దమ్మ దేవి గుడిలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం గేటు తాళాలు పగులగొట్టి మందిరంలోకి చొరబడ్డారు. దేవత వద్ద గల హుండీని ఎత్తుకెళ్లి మందిరం ఆవరణలో గల మామిడి చెట్ల కింద ధ్వంసం చేశారు. అందులో గల నగదు, ఇతర కానుకలను ఎత్తుకెళ్లారు. హుండీలో ఎంత డబ్బు ఉందో తెలియలేదు.

గతంలో కూడా ఈ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆల కమిటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా...దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దమ్మ తల్లి గుడిలో చోరీ... హుండీ ధ్వంసం

ఇవీ చూడండి: 'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details