తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సులు ప్రారంభం.. ప్రజల సంతోషం - నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం

లాక్​డౌన్ సడలింపులతో నిజామాబాద్ జిల్లాలో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ముఖానికి మాస్కులను ధరించి విధులకు హాజరయ్యారు. బస్సుల ప్రారంభం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Buses started in nizamabad people's happiness
బస్సులు ప్రారంభం.. ప్రజల సంతోషం

By

Published : May 19, 2020, 7:12 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ తమ సేవలు ప్రారంభించింది. పలు రూట్లలో బస్సులను నడిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడుపుతున్నారు. ఎక్స్​ప్రెస్​లో 33 మంది, ఆర్డినరి బస్సులో 30 మంది మాత్రమే ఎక్కేందుకు అవకాశం ఇస్తున్నారు. మాస్కులు ధరించకపోతే బస్సులోకి ఎక్కనివ్వడం లేదు.

జిల్లాలో లాక్​డౌన్​కు ముందు పరిస్థితి కనిపించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. చిరు వ్యాపారులు తమ విక్రయాలు ప్రారంభించారు. అన్ని దుకాణాలు తెరుచుకోవడం వల్ల ప్రజల రద్దీ పెరిగింది.

ఇదీ చూడండి :'కేసీఆర్​తో జగన్​ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చింది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details