తెలంగాణ

telangana

కొవిడ్​ సేవలను 'ఆరోగ్య శ్రీ'లో చేర్చాలని భాజపా నేతల ధర్నా

నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భాజపా నాయకులు ధర్నాకు దిగారు. కొవిడ్​-19 వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్​ చేశారు. బోధన్​లో ధర్నా చేస్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

By

Published : Jun 22, 2020, 1:57 PM IST

Published : Jun 22, 2020, 1:57 PM IST

bjp leaders protest for inclusion of covid services in arogyasri  at nizamabad
కొవిడ్​ సేవలను 'ఆరోగ్య శ్రీ'లో చేర్చాలని భాజపా నేతల ధర్నా

కొవిడ్​-19 వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణలో టెస్టుల సంఖ్యను మరింత పెంచి, వైద్య సేవలను విస్తరించాలని డిమాండ్​ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదని వారు ప్రశ్నించారు. బోధన్​ జిల్లా ఆసుపత్రిలో ధర్నా చేస్తున్న భాజపా నేతలను పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

కొవిడ్​ సేవలను 'ఆరోగ్య శ్రీ'లో చేర్చాలని భాజపా నేతల ధర్నా

ABOUT THE AUTHOR

...view details