నిజామాబాద్ నగరంలో భాజపా జన జాగరణ సభ పేరుతో సదస్సు ఏర్పాటు చేశారు. గుజరాత్ ఎంపీ కిరిబాటి సోలంకి, జిల్లా నేతలు హాజరయ్యారు. 370 ఆర్టికల్ రద్దుకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా వివరించారు. జాతీయ సమైక్యత కోసం భాజపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం ఏకతాటిపై నిలబడిందని వెల్లడించారు. సదస్సుకు వివిధ వర్గాలు, ప్రజలు హాజరయ్యారు.
జాతీయ సమైక్యతపై భాజపా ప్రచారం - BJP Campaign on National Integration
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జరిగిన పరిణామాలను వివరించేందుకు భాజపా జాతీయ సమైక్యత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇవాళ ఈ సమావేశాన్ని నిజామాబాద్లో నిర్వహించారు.
![ జాతీయ సమైక్యతపై భాజపా ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4603129-350-4603129-1569846728675.jpg)
జాతీయ సమైక్యతపై భాజపా ప్రచారం