పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, దినసరి కూలీలు, వలస కార్మికులకు పోలీసులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
![పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ Armur Polices Distribution Essential goods supplied for poor peoples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7068428-389-7068428-1588670832607.jpg)
పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీసులు ఉదారతను చాటుకున్నారు. పట్టణ పోలీసులందరూ కలిసి సుమారు వంద మంది నిరుపేదలకు 18 రకాలతో కూడిన నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తమవంతుగా సాయం చేసినట్లు ఏసీపీ రఘ తెలిపారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ... అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.