తెలంగాణ

telangana

పెద్దలను స్మరించుకుంటూ... ఘనంగా 'ఆత్మల పండుగ'

ఆత్మల పండుగ’ను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని ధర్మారం బి గ్రామంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాదులను ఆకర్షణీయంగా అలంకరించి పెద్దలను స్మరించుకున్నారు.

By

Published : Nov 3, 2020, 7:03 AM IST

Published : Nov 3, 2020, 7:03 AM IST

all souls' day 2020 in nizamabad district
all souls' day 2020 in nizamabad district

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని ధర్మారం బి గ్రామంలోని సమాధుల తోటలో ఆత్మల పండుగను ఘనంగా నిర్వహించారు. పునీత లుర్దు మాత క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. మరణించిన తమ పెద్దల స్మారకార్థం నిర్మించిన సమాధులను రంగులు, పూలతో అందంగా అలంకరించారు.

కొవ్వొత్తులను వెలిగించి పెద్దలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన జ్ఞాపకార్థ కూడిక సమావేశంలో సందేశం వినిపించారు. లోకం విడిచిన పెద్దలను స్మరించుకునేందుకు ఏటా సమాధుల పండుగను నిర్వహిస్తున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:35 ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 6 సార్లు సీఎం!

ABOUT THE AUTHOR

...view details