తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిక విద్యుత్​ బిల్లులకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన

లాక్​డౌన్​ సమయంలోని విద్యుత్​ బిల్లులను మాఫీ చేయాలంటూ నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్​ జిల్లా విద్యుత్​ భవన్​ వద్ద నిరసన తెలిపారు.

against the heavy current bills congress leaders protest at nizamabad
అధిక విద్యుత్​ బిల్లులకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన

By

Published : Jul 6, 2020, 5:59 PM IST

అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. నిజామాబాద్ విద్యుత్ భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఎస్ఈకి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అధికంగా వేసిన విద్యుత్ బిల్లులు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details