తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 9:10 AM IST

ETV Bharat / state

ఎస్​బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని ఎస్​బీఐ బ్యాంక్  ఏటీఎంలో ఏసీ పేలింది. ఈ నేపథ్యంలో అందులోనుంచి దట్టమైన పొగలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న ఎస్​బీఐ అధికారులు ప్రమాదం స్థలాన్ని సందర్శించారు.

AC blast at SBI Bank ATM at nizamabad
ఎస్​బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఎస్​బీఐ బ్యాంక్ ఏటీఎంలో ఏసీ పేలింది. ఒక్కసారిగా పోగలు అలుముకున్నాయి. ఆ సమయంలో ఎవరు కూడా ఏటీఎం సెంటర్​లో లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్​బీఐ అధికారులు ప్రమాదం స్థలాన్ని పరిశీలించారు.

కలెక్టరేట్ ప్రాగణంలోని చెట్ల కొమ్మలు నరికే సమయంలో ఆ ఏటీఎంకి సంబంధించిన తీగపై కొమ్మలు పడడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఇలాంటి ఘటన జరగడంపై ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఎస్​బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ

ఇదీ చూడండి : కల్యాణలక్ష్మికి.. అందని 'లక్ష్మీ' కటాక్షం..?

ABOUT THE AUTHOR

...view details