నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో ఏసీ పేలింది. ఒక్కసారిగా పోగలు అలుముకున్నాయి. ఆ సమయంలో ఎవరు కూడా ఏటీఎం సెంటర్లో లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్బీఐ అధికారులు ప్రమాదం స్థలాన్ని పరిశీలించారు.
ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ - The AC exploded at the SBI Bank ATM at NTR Chaurasta in the center of Nizamabad district.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో ఏసీ పేలింది. ఈ నేపథ్యంలో అందులోనుంచి దట్టమైన పొగలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న ఎస్బీఐ అధికారులు ప్రమాదం స్థలాన్ని సందర్శించారు.
![ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ AC blast at SBI Bank ATM at nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5505729-378-5505729-1577413516868.jpg)
ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ
కలెక్టరేట్ ప్రాగణంలోని చెట్ల కొమ్మలు నరికే సమయంలో ఆ ఏటీఎంకి సంబంధించిన తీగపై కొమ్మలు పడడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఇలాంటి ఘటన జరగడంపై ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో పేలిన ఏసీ
ఇదీ చూడండి : కల్యాణలక్ష్మికి.. అందని 'లక్ష్మీ' కటాక్షం..?