తెలంగాణ

telangana

ETV Bharat / state

జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్టు అథారిటీ బృందం పర్యటన - NIZAMABAD AIRPORT

నిజామాబాద్​ జిల్లా జక్రాన్​పల్లి పరిసర ప్రాంతాల్లో ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా బృందం పర్యటించింది. విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ అధికారులకు వివరించారు.

జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్టు అథారిటీ బృందం పర్యటన

By

Published : Aug 21, 2019, 9:51 PM IST

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది. జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్, అర్గుల్, మనోహరాబాద్, తొర్లికొండ శివారు ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. రహదారి, రైల్వే, ఇతర సౌకర్యాలపై ఆరాతీశారు. భౌగోళిక పరిస్థితులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ వివరించారు. ఎయిర్​పోర్టు కోసం సుమారు 850 ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. పదేళ్లుగా ఎయిర్ పోర్టు కోసం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారన్నారు.

జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్టు అథారిటీ బృందం పర్యటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details