తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతన్న ముఠా అరెస్ట్​ - nizamabad cp kartikeya

నిజామాబాద్​ జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. లక్షరూపాయల నగదు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతన్న ముఠా అరెస్ట్​

By

Published : Jul 29, 2019, 11:49 PM IST

ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నిజామాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 27న జన్నెపల్లి క్రాస్​రోడ్​ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు కర్నె లింగం, రమేష్​, నగేష్​ అనుమానాస్పదంగా తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించారు. నగర శివారులోని సారంగపూర్​ హనుమాన్​ ఆలయంలో హుండీ దొంగలించిన విషయం బయటపడింది. వారిని అరెస్ట్​ చేసిన పోలీసులు లక్ష రూపాయల నగదు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలోనూ ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతన్న ముఠా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details