తెలంగాణ

telangana

By

Published : May 9, 2021, 7:46 PM IST

ETV Bharat / state

అనారోగ్యంతో మహిళ మృతి.. సర్పంచ్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

నిర్మల్ జిల్లా జామ్ పెద్దూరులో మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. కరోనా అనే అనుమానంతో బంధువులు ఎవరూ రాలేదు. సర్పంచ్ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.

woman dead with illness,  sarpanch did funerals to woman
మహిళకు సర్పంచ్ అంత్యక్రియలు, అనారోగ్యంతో మహిళ మృతి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ పెద్దూరు గ్రామంలో తుల నడ్పి గంగవ్వ అనే మహిళ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. కరోనాతో మరణించిందనే అనుమానంతో బంధువులు ఎవరు రాలేదు. సర్పంచ్ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్మికులు పీపీఈ కిట్లు ధరించి గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఉపసర్పంచ్ విలాస్, వార్డు సభ్యులు నవీన్​తో పాటు యూత్ సభ్యులు మల్లేష్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి;రాష్ట్రంలో మరో 4,976 కరోనా కేసులు.. 35 మరణాలు

ABOUT THE AUTHOR

...view details