తెలంగాణ

telangana

ETV Bharat / state

బోర్లకు కరెంట్​ కట్​... భగీరథ నీరు రాదు... - water problems at mudhol mandal

ముథోల్​ గ్రామ పంచాయతీ పరిధిలోని నీటిబోర్లకు విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. దీంతో విద్యుత్​ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఆ మోటర్ల ద్వారా వచ్చే నీటినే నిత్యావసారాలు వాడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బోర్లకు కరెంట్​ కట్​... భగీరథ నీరు రాదు...
బోర్లకు కరెంట్​ కట్​... భగీరథ నీరు రాదు...

By

Published : Jan 28, 2020, 8:57 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మేజర్ గ్రామ పంచాయతీ జనాభా దాదాపు 16వేలు. పంచాయతీలో 58 వరకు టూఫేజ్​, త్రీఫేజ్​ బోరు మోటార్లు ఉన్నాయి. ఇందులో 18 మోటర్లకు... విద్యుత్ అధికారులు విద్యుత్​ సరఫరా నిలిపివేశారు. విద్యుత్​ బిల్లులు పెరిగిపోవడమే ఇందుకు కారణం. కొన్ని కాలనీల వాసులు ఈ బోరు మోటర్ల నుంచి వచ్చే నీటినే రోజూ వాడతారు. నిత్యావసరాలతోపాటు తాగునీటి కోసం ఉపయోగించే నీరు రాకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు నీళ్లు వచ్చేలా చూడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

బోర్లకు కరెంట్​ కట్​... భగీరథ నీరు రాదు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details