తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం తీరు నడిచే ఎద్దును పొడిచినట్లుంది: వీఆర్వోలు

విధి నిర్వహణలో పగలనక.. రాత్రనక విధులు నిర్వహిస్తే నడిచే ఎద్దును పొడుస్తున్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని వీఆర్వోలు ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : Aug 2, 2019, 5:11 PM IST

వీఆర్వోలు ఆందోళన

నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్వోలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేశారు. పగలనకా.. రాత్రనక విధులు నిర్వహిస్తే నడిచే ఎద్దును పొడుస్తున్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వీఆర్వోల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details