కొవిడ్ వ్యాప్తి కట్టడికి స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్చాంద మండలంలోని చామన్పల్లి గ్రామస్థులు. గ్రామంలోని వీడీసీ సభ్యులు, గ్రామస్థులతో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించిన సర్పంచ్... ఈ తీర్మానం చేసుకున్నారు.
స్వచ్ఛంద లాక్డౌన్ - తెలంగాణలో కరోనా కేసులు
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని చామన్ పల్లిలో సోమవారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ పడిగెల గంగాధర్, ఉప సర్పంచ్ తెలిపారు.
telangana news
ఉదయం, సాయంత్రం రెండు గంటలు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు, కిరాణాషాపులు తెరచి ఉంటాయి. హోటళ్లు, కటింగ్ షాపులు, బీడీ కంపెనీలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వీడీసీ ఆధ్వర్యంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?