తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 4:07 PM IST

ETV Bharat / state

స్వచ్ఛంద లాక్​డౌన్​

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని చామన్ పల్లిలో సోమవారం నుంచి స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ పడిగెల గంగాధర్, ఉప సర్పంచ్ తెలిపారు.

voluntary lock down in chamanpally
telangana news

కొవిడ్​ వ్యాప్తి కట్టడికి స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు నిర్మల్​ జిల్లా లక్ష్మణ్​చాంద మండలంలోని చామన్​పల్లి గ్రామస్థులు. గ్రామంలోని వీడీసీ సభ్యులు, గ్రామస్థులతో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించిన సర్పంచ్​... ఈ తీర్మానం చేసుకున్నారు.

ఉదయం, సాయంత్రం రెండు గంటలు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు, కిరాణాషాపులు తెరచి ఉంటాయి. హోటళ్లు, కటింగ్ షాపులు, బీడీ కంపెనీలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వీడీసీ ఆధ్వర్యంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

ABOUT THE AUTHOR

...view details