తెలంగాణ

telangana

బాసర సరస్వతి దేవి ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

By

Published : Jan 30, 2020, 9:34 AM IST

శ్రీ పంచమిని పురస్కరించుకుని నిర్మల్​ జిల్లా బాసరలో సరస్యతి దేవి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పాలకవర్గాలు వేకువజామున 3 గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు.

vasantha panchami celebrations in basara temple
బాసర సరస్వతి దేవి ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

వసంత పంచమిని పురస్కరించుకుని నిర్మల్​ జిల్లా బాసరలో సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి ఒంటిగంటకు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలను ఆలయ పాలక వర్గాలు ప్రారంభించారు.

ఉదయం 11 గంటల నుంచి చండీ మహా విద్యా హోమం, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. సాధారణ, రూ.వెయ్యి టికెట్‌తో వేర్వేరు మండపాల్లో అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.

దర్శనానికి వెళ్లే ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు భక్తులు, పిల్లలకు పాలు, నీళ్లు పంపిణీ చేస్తున్నారు.

బాసర సరస్వతి దేవి ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

ఇదీ చూడండి: అంగరంగ వైభవంగా ముగిసిన నాగోబా జాతర

ABOUT THE AUTHOR

...view details