నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జీ) మండలం నందన్ గ్రామ సమీపంలో బైంసా-నిర్మల్ రహదారిపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుస్లి గ్రామానికి చెందిన సూర అరుణ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం రహదారికి పక్కన ముళ్లపొదలో పడి ఉంది.
తల తెగి పడి.. మృతి చెందిన యువకుడు
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. తల పూర్తిగా తెగి పడిన ఘటన నిర్మల్ జిల్లా నందన్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
తల తెగి పడి.. మృతి చెందిన యువకుడు
ఘటనా స్థలంలో యువకుని తల తెగి ఉండటం వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్సై రమణ ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత