తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి' - 'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి'

నిర్మల్ జిల్లా భైంసా విశ్రాంతి భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల గురించి తెలిపారు.

'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి'

By

Published : Nov 20, 2019, 6:27 PM IST

Updated : Nov 20, 2019, 7:53 PM IST

కేంద్ర ప్రభుత్వ మంత్రులంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి మెచ్చుకున్నారని తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు. ఇంటింటికీ నీళ్లందించేందుకు తీసుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఒక నవోదయ, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు రావట్లేదని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు.

'అవార్డులు, ప్రశంసలు కాదు నిధులు కేటాయించండి'
Last Updated : Nov 20, 2019, 7:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details