తెలంగాణ

telangana

By

Published : May 29, 2021, 2:57 PM IST

ETV Bharat / state

Sorghum Seeds : రైతులకు రాయితీపై కంది విత్తనాలు

రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న కంది విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో రైతులకు రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు.

sorghum seeds on subsidy, subsidy sorghum for farmers
రాయితీ కంది విత్తనాలు, రైతులకు రాయితీ కంది విత్తనాలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్రంలో రైతులంతా పంట మార్పిడి చేస్తూ.. అధిక లాభాలు గడించాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం కర్షకులకు అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో రాయితీ కంది విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. తెలంగాణ సర్కార్​ రాయితీపై అందిస్తున్న కంది విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

అనంతరం అధికారులు, కలెక్టర్​తో కలిసి మంత్రి కరోనా తీవ్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమాత్​తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details