తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన శ్రీ మహా పోచమ్మ జాతర - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

నిర్మల్​ జిల్లా ఆడిల్లిలో శ్రీ మహా పోచమ్మ జాతర ఘనంగా ముగిసింది. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. అమ్మవారిని దర్శించుకున్నారు.

Sri Maha Pochamma Jatara ended in nirmal district
ఘనంగా ముగిసిన శ్రీ మహా పోచమ్మ జాతర

By

Published : Oct 19, 2020, 12:00 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడిల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ జాతర ఆదివారం ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన జాతరలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

పోచమ్మ ఆలయంలోని అమ్మవారి ఆభరణాలను దసరా నవారాత్రుల్లోని మొదటి ఆదివారం దిలావార్​పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గల గోదావరిలో జలాభిషేకం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అమ్మవారి ఆభరణాలకు సాంగ్విలోని గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భాజా భజంత్రీలు, పోతురాజుల నృత్యాలతో దిలావార్​పూర్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

అమ్మవారి ఆభరణాలను దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లాతో పాటు, నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి.. బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details