నిర్మల్ జిల్లా బుధవార్పేట్లోని శివాలయంలో లింగ పున:ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు.. మంత్రోచ్ఛారణల నడుమ శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు.
నిర్మల్లో ఘనంగా లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు - minister indrakaran reddy
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో.. లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. వేద మంత్రాల నడుమ.. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. హరహర మహాదేవ శంభోశంకరా అంటూ భక్తులందరూ పారవశ్యంతో మునిగిపోయారు.
![నిర్మల్లో ఘనంగా లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు Shivalinga restoration ceremonies in Nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10025269-588-10025269-1609068981221.jpg)
Shivalinga restoration ceremonies in Nirmal
జిల్లా కేంద్రం పరిధిలోని పురాతన శివకోటి ఆలయం శిథిలావస్తకు చేరుకుంది. ఆ మేరకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంజూరు చేసిన రూ. 50 లక్షలతో, నిర్వాహకులు నూతన ఆలయాన్ని నిర్మించారు. సోమవారం నాడు శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్యుల చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేపట్టనున్నారు.