తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 9:25 AM IST

ETV Bharat / state

బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

బాసర శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిని అవతారంలో దర్శనమిచ్చారు.

Sharannavaratri celebrations in Basara temple
బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్​ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో రెండవ రోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు భక్తులకు బ్రహ్మచారిని అవతారంలో దర్శనమిచ్చారు. కరోనా, హైదరాబాద్​ వర్షాల దృష్ట్యా భక్తుల తాకిడి తగ్గింది. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యసాలు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు.. ఆలయ అధికారులు తగు సూచనలు చేస్తున్నారు.

21వ తేదన మూలనక్షత్రం సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు కావడంతో ఆరోజు చిన్నారులకు ఉదయం 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చేతుల మీదుగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలు 25వ వరకు కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details