తెలంగాణ

telangana

ETV Bharat / state

పదోతరగతి పరీక్షలో గందరగోళం.. తెలుగు బదులు సంస్కృతం - SANSKRIT PAPER IS GIVEN IN PLACE OF TELUGU PAPER

నిర్మల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఒక సబ్జెక్టు​ బదులు మరో సబ్జెక్టు పేపర్​ను అందించారు. ఫలితంగా గందరగోళానికి గురైన విద్యార్థులు విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు సరైన సమాధానం ఇవ్వలేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడింది.​

తెలుగు పేపర్​కు బదులుగా సంస్కృతం ఇస్తే మా గతేంటి ?
తెలుగు పేపర్​కు బదులుగా సంస్కృతం ఇస్తే మా గతేంటి ?

By

Published : Mar 20, 2020, 6:13 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వివేకానంద హై స్కూల్ యాజమాన్యం చేసిన తప్పిదం పదో తరగతి విద్యార్థులకు శాపంగా మారింది. పదో తరగతి పరీక్షల్లో తెలుగు పేపర్ 2 కు బదులు సంసృతం సబ్జెక్టు పేపర్ ఇచ్చారు. విద్యార్థులు అక్కడి ఇన్విజిలేటర్ల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. సదరు సబ్జెక్టును స్కూల్ యాజమాన్యం ఆన్​లైన్​లో ఎంపిక చేసుకుందని తెలిపారు. ఫలితంగా విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.

భవిష్యత్తు అగమ్యగోచరం...

తెలుగు పేపర్ 2లో 60 మార్కులు ఉంటాయి. సంసృతం సబ్జెక్ట్​కు 20 మార్కులే ఉంటాయి. అవగాహన లేని సబ్జెక్ట్ ఎలా రాయాలని స్కూల్ యాజమాన్యాన్ని అడిగినా... వారి నుంచి సరైన స్పందన లేదు. వివేకానంద హై స్కూల్​కు చెందిన 35 మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. వెంటనే తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్ల భవిష్యత్​ నాశనం చేశారంటూ ఆవేదన చెందుతున్నారు.

తెలుగు పేపర్​కు బదులుగా సంస్కృతం ఇస్తే మా గతేంటి ?

ఇవీ చూడండి : కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details