నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా జానుభాయ్ తెలిపారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో పాటు విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఈని కలిసి వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు.
విద్యుత్ సరఫరా లేక పోచంపల్లి వాసుల ఇబ్బందులు - nirmal district news
విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్థుల సమస్యను నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచంపల్లి జడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరాకు కావాల్సిన పూర్తి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
![విద్యుత్ సరఫరా లేక పోచంపల్లి వాసుల ఇబ్బందులు no electricity supply, no electricity supply in pochampally village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:36:32:1622466392-tg-adb-32-31-vinatipatramandajeta-av-ts10033-31052021170925-3105f-1622461165-630.jpg)
పోచంపల్లిలో విద్యుత్ సరఫరా, తెలంగాణ వార్తలు, నిర్మల్ జిల్లా వార్తలు
విద్యుత్ లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు జడ్పీటీసీ తెలిపారు. ఆయా శాఖల అధికారులు విద్యుత్ సరఫరాకు కావాల్సిన పూర్తి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.