తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీ ఢీకొట్టి ముధోల్ గ్రామపంచాయతీ ఈవో మృతి

రోజూ వెళ్లినట్టుగానే విధి నిర్వహణకు మనోజ్ కుమార్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలోనే మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది.

By

Published : Jun 12, 2019, 3:52 PM IST

లారీ ఢీకొట్టి ముధోల్ గ్రామపంచాయతీ ఈవో మృతి

నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్​పాడ్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముధోల్ గ్రామపంచాయతీ ఈవో దుర్మరణం పాలయ్యారు. ఖానాపూర్​కు చెందిన మనోజ్ కుమార్ విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై భైంసా వైపు వస్తుండగా... వానల్​పాడ్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

లారీ ఢీకొట్టి ముధోల్ గ్రామపంచాయతీ ఈవో మృతి

ABOUT THE AUTHOR

...view details