నిర్మల్ మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికులు తమను రెగ్యులర్ కార్మికులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కోరారు. ఈ మేరకు పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆగస్టు 11న హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
'పురపాలక ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలి' - Nirmal District Collector Musharraf Ali Farooqi
నిర్మల్ మున్సిపాలిటీలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులు తమను రెగ్యులర్ కార్మికులుగా గుర్తించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతి పత్రం అందజేశారు.
!['పురపాలక ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలి' Nirmal Municipal Contract Workers protest demands to regularize them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8711269-211-8711269-1599472640085.jpg)
నిర్మల్ పురపాలికలో ఒప్పంద కార్మికుల ధర్నా
ఎన్నో ఏళ్లుగా పురపాలికలో పలు విభాగాల్లో చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని, తమ సేవలు గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇవీచూడండి:తెలంగాణ శాసనసభ, మండలి రేపటికి వాయిదా