నిర్మల్ జిల్లా మామడ మండలంలోని న్యూ సాంగ్వీ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.
వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ - నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు
రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లకు తరలించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.
![వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ nirmal jc visited paddy purchase center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:17:13:1620647233-tg-adb-34-10-adanapucollectorvisit-av-ts10033-10052021171610-1005f-1620647170-23.jpg)
వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాథోడ్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా