తెలంగాణ

telangana

ETV Bharat / state

అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులే… - tenth day of lockdown in nirmal

కరోనా వైరస్ రెండో దశ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఇన్​ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

incharge sp praveen kumar inspection in nirmal
అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులే…

By

Published : May 21, 2021, 5:42 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో పదో రోజు కొనసాగుతున్న లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు జిల్లా ఇన్​ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్. అలాగే పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయాలని విధుల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

లాక్​డౌన్​ సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండచి బయటకు రాకూడదని ఇన్​ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్ సూచించారు. సరైన కారణం లేకుండా వాహనాలపై బయట తిరుగుతూ కనబడితే... వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

sఇదీ చదవండి:గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం

ABOUT THE AUTHOR

...view details