తెలంగాణ

telangana

By

Published : Aug 22, 2020, 7:51 PM IST

ETV Bharat / state

ఫేస్‌బుక్‌లో ఫొటో పోస్ట్‌.. నిర్భయ చట్టం కింద కేసు

నిర్మల్‌ జిల్లా ముధోల్‌లో ఓ వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఓ వివాహిత ఫొటోను సామాజిక మాధ్యమంలో పెట్టడం వివాదానికి కారణమైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నర్సింగరావు తెలిపారు.

ఫేస్‌బుక్‌లో ఫొటో పోస్ట్‌.. నిర్భయ చట్టం కింద కేసు
ఫేస్‌బుక్‌లో ఫొటో పోస్ట్‌.. నిర్భయ చట్టం కింద కేసు

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఓ వివాహిత ఫొటోను సామాజిక మాధ్యమంలో అనవసరంగా పెట్టడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా ఆ వ్యక్తిపై నిర్భయ కేసు నమోదైంది.

ముధోల్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ వివాహిత ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అది గమనించిన కుటుంబీకులు ఆ మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం అందించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నర్సింగరావు తెలిపారు.

ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ABOUT THE AUTHOR

...view details