'మనమంతా... పటేల్ ఆశయాల కోసం పాటుపడాలి'
కుల, మత భేదాలు విడనాడి దేశ ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు.
నిర్మల్లో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 144వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏక్తా యాత్ర నిర్వహించి దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ చేశారు. దేశ భవిష్యత్ నేటి యువతపైనే ఉందని జిల్లా విద్యాధికారి ప్రణీత అన్నారు. అందరూ సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాల కోసం పాటుపడాలని సూచించారు.
- ఇదీ చూడండి : కీర్తి క్రిమినల్ ఎందుకయింది?