నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ కార్యాలయం ఎదుట పురావస్తుశాఖ స్థలంలోని కంచెను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ముందు ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాస్తారోకో చేపట్టడంతో రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ జోక్యం చేసుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.